ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై అజేయమైన శతకంతో విరుచుకపడ్డాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది సీఎస్కే. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తడబాటుకు గురి కాకుండా సంజు శాంసన్ అడ్డుగోడలా నిలబడ్డాడు. తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ ను ప్రత్యర్థి జట్టు ముందు ఉంచాడు. తను కేవలం 54 బంతులు మాత్రమే ఎదుర్కొని 101 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు , 6 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేవలం ఫోర్లు , సిక్సర్ల ద్వారా 76 రన్స్ చేయడం విశేషం.
అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముండై ఇండియన్స్ చెన్న సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి, స్పిన్ మాయజాలానికి తలవంచక తప్పలేదు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా 103 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సూర్య కుమార్ యాదవ్ 35 రన్స్ చేస్తే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 37 పరుగులతో నిరాశ పరిచారు. ఆ తర్వాత ఏ ఒక్కరూ సింగిల్ స్కోర్ కూడా చేయలేక పోయారు. అకీల్ హుసేన్ 17 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ సందర్బంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు సంజూ శాంసన్. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన భార్య గురించి.
ఈ అవార్డు కేవలం ఒక సంఖ్య మాత్రమే, కానీ దీనిని చేరుకోవడానికి చాలా సుదీర్ఘ ప్రయాణం పట్టింది. ఈ ప్రత్యేక క్షణాన్ని నా భార్య చారుకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. కొన్ని రోజులు నేను శూన్యంగా, నిరాశగా భావించాను, ఒక చెడ్డ ఆట తర్వాత నన్ను నేను సందేహించుకున్నాను, కానీ ఆమె ఎప్పుడూ అలా చేయలేదు. ఆమె నాలోని మంచి చెడులను చూసింది, అయినా కూడా నాకు అండగా బలంగా నిలిచింది. నన్ను నవ్విస్తూ, సంతోషంగా ఉంచినందుకు, నేను నన్ను నమ్మనప్పుడు కూడా నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. పొండట్టి, ఇది నీ కోసమే అంటూ తెలిపాడు.
