మీ-సేవ ద్వారా రోజుకు 2.8 లక్షల లావాదేవీలు

వెల్ల‌డించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిట‌ల్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఇందులో భాగంగా కేవ‌లం మీ సేవ ద్వారా రోజుకు 2.8 ల‌క్ష‌ల లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణలోని పౌరులు మీ-సేవ సేవల ద్వారా ఒక్క రోజులోనే సుమారు 2.8 లక్షల డిజిటల్ లావాదేవీలను పూర్తి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. . హైద‌రాబాద్ లో జరిగిన ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్ కాంక్లేవ్స్ సందర్భంగా దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సుమారు 580 మీ-సేవ ప్రజా సేవలను అందిస్తోందని తెలిపారు. మీ-సేవ అనేది తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఒక ఈ-గవర్నెన్స్ కార్యక్రమం అని వెల్ల‌డించారు.

ఇది పౌరులకు ప్రభుత్వానికి మధ్య వివిధ రకాల డిజిటల్, భౌతిక సేవలను అందిస్తుందని చెప్పారు శ్రీ‌ధ‌ర్ బాబు. స్థానిక ఫ్రాంచైజీ కేంద్రాల ద్వారా లేదా తెలంగాణ మీ-సేవ పోర్టల్ , ఆంధ్రప్రదేశ్ మీ-సేవ పోర్టల్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా ధృవీకరణ పత్రాలను పొందడానికి, యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి , ప్రభుత్వ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది ప్రజలకు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా పౌర-కేంద్రీకృత పాలన, దీనినే మేము ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. వాస్తవానికి, మీ-సేవ ద్వారా ఒక్క రోజులోనే సుమారు 2.8 లక్షల లావాదేవీలు జరగడం ప్రపంచానికి తెలియ జేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు మంత్రి. ఈ విధానం ద్వారా పౌరులకు 580 ప్రజా సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన గుర్తు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!