హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా శాఖ సంచలన ప్రకటన చేసింది .తమ క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా నకిలీ విద్యా ధృవపత్రాలను సమర్పించారని తాజా తనిఖీలో తేలడం కలకలం రేపింది. దీంతో ఇంటర్మీడియట్ విద్యా శాఖ 37 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు సమర్పించిన విద్యా ధృవపత్రాలపై తనిఖీని ప్రారంభించింది. ప్రాధాన్యతా మూలంగా. 2023లో తమ ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు తమ విద్యకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. తనిఖీ చేయగా అవి పూర్తిగా నకిలీవని తేలింది. దీంతో చర్యలకు దిగింది ఇంటర్ విద్యా శాఖ. మరో వైపు కళాశాలలు తమ నిరభ్యంతర పత్రాలపై సీనియర్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తేలిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఈ తాజా తనిఖీలో భాగంగా గతంలో కాంట్రాక్ట్ సర్వీసుల నుండి క్రమబద్ధీకరించబడిన దాదాపు 360 మంది జూనియర్ లెక్చరర్ల ధృవపత్రాలను శాఖ తిరిగి పరిశీలించింది. దీని ప్రకారం ఆయా విశ్వ విద్యాలయాల నుండి ధృవపత్రాల ప్రామాణికతపై సమాచారాన్ని కోరారు. జూనియర్ లెక్చరర్లు సంబంధిత విశ్వ విద్యాలయాలు జారీ చేయని పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా బీటెక్ సర్టిఫికేట్లను సమర్పించారు. ఇవి నకిలీవని తేలడంతో ఇంటర్ విభాగం షో కాజ్ నోటీసులు జారీ చేసింది. తమపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరిస్తూ షో కాజ్ నోటీసులకు స్పందించాలని, ఏడు రోజుల్లోగా బీఎన్ఎస్ కింద ఫోర్జరీ ,మోసంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జూనియర్ లెక్చరర్లను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాల హయాంలో విభాగం కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమించింది. వారి సేవలను తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. పలువురు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు తమ ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం నకిలీ సర్టిఫికేట్లను సమర్పించారని ఫిర్యాదులు రావడంతో, పలు దఫాలుగా సర్టిఫికేట్ల ధృవీకరణను నిర్వహించింది.
