Priyanka Gandhi : ప్రియాంక గాంధీకి అపూర్వ ఆద‌ర‌ణ

క‌లిసేందుకు పోటీ ప‌డ్డ క‌మ‌లనాథులు

Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ఎక్క‌డికి వెళ్లినా అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఆమె ప్ర‌స్తుతం యూపీ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను భుజాల మీద వేసుకున్నారు.

అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్క‌త్తే పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపుతున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ప‌లు చోట్ల భారీ ర్యాలీలు చేప‌ట్టారు. ఆమెను చూసేందుకు, క‌లిసేందుకు పోటీ ప‌డుతున్నారు. యూపీలో మొద‌టిసారిగా ఏ పార్టీ చేయ‌ని సాహసం ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) చేశారు.

ఏకంగా 40 శాతంకు పైగా సీట్ల‌ను మ‌హిళ‌ల‌కే కేటాయించింది. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి టికెట్ల‌ను ఇచ్చింది. మ‌హిళ‌లు, యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపునిచ్చింది.

చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌లు లేక పోతే ఎలా మ‌న గురించి ఎవ‌రు మాట్లాడ‌తారంటూ ప్ర‌శ్నించింది. వాళ్ల‌ను చైత‌న్య‌వంతం చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్టీకి తిరిగి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చే ప‌నిలో ప‌డింది ప్రియాంక గాంధీ.

అహ‌ర్నిశ‌లు కృషి చేస్తోంది. ప్ర‌ధానంగా ప్ర‌ధాని మోదీ, బీజేపీ, సీఎం యోగిని టార్గెట్ చేస్తూ ముందుకు క‌దులుతోంది. తాజాగా ఊహించ‌ని స‌న్నివేశం చోటు చేసుకుంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేప‌ట్టిన ర్యాలీలో ప్రియాంక గాంధీని క‌లిసేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోటీ ప‌డ్డారు.

ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : కేంద్రాన్ని ప్ర‌శ్నించినందుకే అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!