Ajay Bhupati : అంచనాలు పెరిగిన ‘మహా సముద్రం’
Ajay Bupati : ఆర్ఎక్స్ 100 చిత్రంతో సత్తా చాటిన దర్శకుడు అజయ్ భూపతి తన రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
Ajay Bupati : ఆర్ఎక్స్ 100 చిత్రంతో సత్తా చాటిన దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bupati) తన రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ‘మహా సముద్రం’ అంటూ వినూత్న కథను రెడీ చేసుకుని నాగ చైతన్య తో సహా పలువురు హీరోల ను కలసి కథ వినిపించినా ఎందుకనో అంతా నో అనటమో. కాల్షిట్లు ఎడ్జిస్ట్ కాకపోవటమో జరిగి పోయింది. దీంతో ఆ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు శర్వానంద్ వద్దకు చేరి ఆగింది. విభిన్న కథాంశాలు ఎంచుకునే శర్వానంద్ ఈ కథపై మనసు పారేసుకున్నాడనగానే ఇది మాగా విషయమున్న సినిమానే అని సినీ జనాలకు అర్ధమైంది.
కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగాహైదరాబాద్ శివారు లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ తో ఆరంభమైంది. తన సినిమా గురించి అజయ్ మీడియాతో మాట్లాడుతూ అసాధారణమైన పాత్రలతో కూడిన ఉద్రేకభరితమైన లవ్ స్టోరీని, ఇంటెన్స్ డ్రామా ఇంతకుముందెప్పుడూ మీరు చూడని అనుభూతి ఈ సినిమాలో చూస్తారంటూ చెప్పుకొచ్చాడు అన్నట్టు ఈ చిత్రంలో శర్వాతో పాటు సిద్దార్థ్ కూడ ఒక కీలక పాత్ర చేస్తుండటం హైప్ బాగా పెంచింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అదితిరావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
No comment allowed please