ది అట్టాంటిక్ పై ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ దావా

త‌న గురించి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించార‌ని పైర్

అమెరికా : ఎఫ్‌బిఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ సంచ‌ల‌నంగా మారారు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ ది అట్లాంటిక్‌పై ఎఫ్‌బిఐ డైరెక్టర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు . ఏకంగా స‌ద‌రు ప‌త్రిక‌పై పటేల్ 250 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం ఇవ్వాల‌ని కోరడం క‌ల‌క‌లం రేపింది. అట్లాంటిక్ కథనంలోని ఆరోపణలను ఖండించారు. మద్యం సేవించడం, విధులకు గైర్హాజరు కావడం వంటి ఆరోపణలు చేస్తూ, ఆ పత్రిక అజ్ఞాత మూలాలను ఉటంకించింది. తొందరపాటుతో కూడిన ప్రచురణ కాలక్రమాన్ని ప్రస్తావించారు. అసలు దురుద్దేశం ఉందని పటేల్ దావాలో పేర్కొన్నారు. డైరెక్టర్‌కు జాతీయ భద్రతకు ముప్పు కలిగించేంత మద్యపాన సమస్య ఉందని ఆరోపిస్తూ శుక్రవారం ఒక కథనం ప్రచురితమైన తర్వాత, ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ అట్లాంటిక్ ,దాని రిపోర్టర్ సారా ఫిట్జ్‌ప్యాట్రిక్‌పై పరువు నష్టం దావా వేశారు.

మొదట కాష్ పటేల్ అస్తవ్యస్త ప్రవర్తన ఆయన ఉద్యోగానికి ముప్పు కలిగించవచ్చు అనే శీర్షికతో వచ్చిన ఆ పత్రిక కథనం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ప‌టేల్ ప్ర‌వ‌ర్త‌న ఎఫ్‌బిఐ, న్యాయ శాఖలోని అధికారులను కలవర పరిచాయని ది అట్లాంటిక్ ప‌త్రిక‌ ఉటంకించింది. ఇదిలా ఉండ‌గా ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ త‌రుచుగా అందుబాటులో ఉండ‌క పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా ఉంద‌ని పేర్కొంది. అయితే వైట్ హౌస్, న్యాయ శాఖ, పటేల్ ఈ ఆరోపణలను ఖండించారు. అట్లాంటిక్ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం కావాల‌ని త‌న‌ను దురుద్దేశ పూర్వ‌కంగా , కావాల‌ని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం అని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!