కోల్ కతా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ గెలుపొందింది. ప్రస్తుతం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. మరో వైపు టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ఆస్ట్రేలియాను పసికూనలు అని భావించిన జింబాబ్వే ఓడించింది. టోర్నీలో ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది. ఈ తరుణంలో భారత జట్టు ఓపెనర్ల సమస్యను ఎదుర్కొంటోంది. ప్రధానంగా స్టార్ హిట్టర్ అభిషేక్ శర్మ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. మరో వైపు ఇషాన్ కిషన్ దంచి కొడుతున్నాడు. మరో వైపు ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్నాడు సంజూ శాంసన్.
ఈ తరుణంలో సౌరవ్ గంగూలీ స్పందించాడు. తను శనివారం మీడియాతో మాట్లాడాడు. సంజు సామ్సన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పటికే గతంలో మూడు సెంచరీలు చేశాడు పొట్టి ఫార్మాట్ లో. స్థిరమైన అవకాశాలకు అర్హుడని పేర్కొన్నాడు. పదే పదే ఛాన్స్ లు ఇచ్చి ఆ తర్వాత తీసి వేస్తే ఏ ఆటగాడూ స్థిరమైన ఆటను ప్రదర్శించ లేడని అభిప్రాయపడ్డాడు సౌరవ్ గంగూలీ. తను ఫామ్ లోకి రావడానికి ఎంతో సమయం పట్టదన్నాడు. గత ఏడాది లో దుమ్ము రేపాడు. సంజూ శాంసన్ కు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు. ఇదిలా ఉండగా కేరళ స్టార్ క్రికెటర్ నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 22 రన్స్ చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఒక ఫోర్ ఉంది.
