దంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు

33 మంది చిన్నారుల‌పై లైంగిక దాడి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఉత్త‌ర ప్ర‌దేశ్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 33 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడడ‌మే కాకుండా వీడియోలు తీయ‌డం, ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌చ్చారు మాజీ ఇంజనీర్ దంపతులు. ఇందుకు సంబంధించి కేసు న‌మోదైంది. శ‌నివారం కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. తుది తీర్పును వెలువ‌రించింది. ఈ సంద‌ర్బంగా ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రోజు రోజుకు మాన‌వీయ విలువలు దిగ‌జారి పోతున్నాయ‌నే దానికి ఈ జంట ఓ ఉదాహ‌ర‌ణ అని పేర్కొంది. కేసుకు సంబంధించి దంపతులకు మరణశిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు వెలువ‌రించింది.

ఇదిలా ఉండ‌గా 2010 – 2020 మధ్య పది సంవ‌త్స‌రాల‌లో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డారు మాజీ ఇంజనీర్ దంపతులు. రామ్ భవాన్ చిత్రకూట్ జిల్లాలో నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పని చేసిన నిందితుడు తన భార్య దుర్గావతితో కలిసి దారుణ ఆకృత్యాలకు ఒడిగట్టాడు. ఈ ఆకృత్యాలకు సంబంధించిన 2 లక్షల వీడియోలు, ఫోటోలు తీసి ఇంటర్నెట్ ద్వారా 47 దేశాలకు సరఫరా చేశాడు. భారీ ఎత్తున డ‌బ్బులు మూట‌గ‌ట్టుకున్న‌ట్లు తేలింది. ఇదిలా ఉండ‌గా ఆన్ లైన్ వీడియో గేమ్స్, కానుకల పేరుతో పిల్లలను మభ్యపెట్టాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లి దారుణాలకు ఒడిగట్టారు ఈ దంప‌తులు. బాధితుల్లో మూడేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై 2020 అక్టోబర్‌లో సీబీఐ కేసు నమోదు చేయగా.. మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది ఉత్తర ప్రదేశ్ పోక్సో కోర్టు.

Leave A Reply

Your Email Id will not be published!