Vasantha Krishna Prasad : జ‌గ‌న్ చెప్పిన‌ట్టు న‌డుచుకుంటా

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్

Vasantha Krishna Prasad : అమ‌రావ‌తి – ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో వైసీపీ బాస్, సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఎలాగైనా స‌రే మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టి నుంచే పార్టీ ప‌రంగా జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇస్తారో లేదోన‌న్న భ‌యం ప‌ట్టుకుంది.

Vasantha Krishna Prasad Comment

ఇప్ప‌టికే ప‌లువురిని త‌న వ‌ద్ద‌కు పిలిపించు కుంటున్నారు. ఇదే స‌మ‌యంలో వారికి నో ఛాన్స్ అంటూ చెప్ప‌డంతో బ‌య‌ట‌కు చెప్ప‌లేక లోలోప‌ల కుమిలి పోతున్నారు. ఈ త‌రుణంలో తాజాగా వైసీపీకి షాక్ త‌గిలింది . ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీ‌నివాస్ యాద‌వ్ ఉన్న‌ట్టుండి ఆ పార్టీని వీడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలో చేరారు.

ఈ త‌రుణంలో తాజాగా సీఎంఓ నుండి ఫోన్ రావ‌డంతో హుటా హుటిన క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్(Vasantha Krishna Prasad). దీంతో త‌న‌కు సీటు రావ‌డం లేదంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్య‌మాల‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి సంబంధించిన అంశాల‌ను సీఎం దృష్టికి తీసుకు వెళ్లాన‌ని చెప్పారు. రాజ‌కీయ ప‌ర‌మైన విష‌యాలు ఏవీ సీఎంతో మాట్లాడ లేద‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి ఆదేశాల ప్ర‌కారం న‌డుచుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Virat kohli : విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్

Leave A Reply

Your Email Id will not be published!