Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య వివాదానికి ఇది ప్రారంభం మాత్రమేనని న్యూనేషన్ టీవీ జర్నలిస్టు క్రిస్ కూమో తాజాగా పేర్కొన్నారు. మస్క్పై ట్రంప్(Donald Trump) పరువు నష్టం దావా వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టైన్ కేసుకు ట్రంప్ పేరును ముడిపెట్టిన మస్క్ చేయకూడని తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం చివరకు కోర్టుకు చేరుతుందని అంచనా వేశారు.
Donald Trump Case in
ఇప్పటివరకూ మస్క్, ట్రంప్ మధ్య జరిగినదంతా అసలు వివాదమే కాదని కూమో అన్నారు. అసలు కథ ముందు ఉందని అన్నారు. పరువు నష్టం దావా అనేది ట్రంప్ చేతుల్లోని అత్యంత శక్తిమంతమైన ఆయుధమని అన్నారు. ఈ వివాదం ఎంతలా ముదురుతుందో జనాలు ఊహించలేకపోతున్నారని కూడా అన్నారు.
మస్క్ పనులు మూర్ఖంగా ఉన్నాయని, చివరకు ఆయన భారీ మూల్యం చెల్లించుకోవచ్చని కూమో అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మస్క్ సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పడిపోయిందని, ప్రభుత్వ వర్గాల్లో మస్క్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిందని అన్నారు. ట్రంప్ మద్దతుదారులు మస్క్కు దూరమయ్యారని తెలిపారు. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్ సంస్థల ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా రిస్క్లో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు దిగడం సబబు కాదని అన్నారు. ట్రంప్ ఇప్పటికే ఓసారి పరువు నష్టం దావా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మస్క్పై కూడా ఇదే ఆయుధాన్ని ప్రయోగిస్తారని అన్నారు.తన ఆరోపణల్లో నిజం లేదని తెలిసీ మస్క్ ఇలాంటి బహిరంగ ఆరోపణలకు చేశారంటూ ట్రంప్ భారీ పరిహారాన్ని రాబట్టే అవకాశం ఉందన్నారు కూమో తెలిపారు.
లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టైన్ కేసుకు సంబంధించిన ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఇటీవల సంచలన పోస్టు పెట్టారు. ఆ తరువాత కొద్ది సేపటికే దాన్ని తొలగించారు. ఈ పోస్టుపై ట్రంప్ ఇప్పటికీ స్పందించకపోవడం రాబోయే తీవ్ర పరిణామాలకు సంకేతమని కూమో పేర్కొన్నారు.
Also Read : TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ