పార్టీ బలోపేతం కోసం కష్టపడతా : నారా లోకేష్‌

నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

చంద్రగిరి: తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాన‌ని, పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతాన‌ని , శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్జతలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన యువనేత లోకేష్ తొలిసారిగా తమ ప్రాంతానికి రావడంతో చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ముంచెత్తారు.

ప్రత్యర్థులు బెదిరించినా భ‌య‌ప‌డ‌కుండా తొడగొట్టి ఎన్నికల బరిలో నిలబడిన అంజిరెడ్డి తాత, ప్రాణం పోతున్నా ప్రత్యర్థి పేరు త‌న నోట ప‌ల‌క‌ని తోట చంద్రయ్య, రక్త మోడుతున్నా పోలింగ్ బూతులో కూర్చున్న మంజులారెడ్డి నాకు స్పూర్తి. మీ అందరి త్యాగాల వల్లే 94 శాతం సీట్లతో ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నాం అన్నారు నారా లోకేష్‌. ప్రజలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలుంటాయని పాదయాత్రలో చెప్పాన‌ని అన్నారు. అదే ఇప్పుడు చేస్తున్నాం అన్నారు. మేం వారి మాదిరిగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదన్నారు. అభంశుభం తెలియని అమర్నాథ్ గౌడ్, అబ్ధుల్ సలాం, తోట చంద్రయ్య వంటి వారిని నిర్ధాక్షిణ్యంగా పొట్టన బెట్టుకున్నారని వాపోయారు. దోషులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!