హైదరాబాద్ : టాలీవుడ్ కు చెందిన నటి విష్ణుప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్ లైన్ వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ వాపోయింది. తప్పుడు, నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా తన వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితంపై ఒక యూట్యూబ్ ఛానల్ తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించిందని ఆరోపించింది నటి విష్ణుప్రియ. తమకు ఫిర్యాదు చేశారంటూ ఓ పోలీస్ అధికారి ధ్రువీకరించారు. హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) జి రమేష్ నాయుడు ప్రకారం ఆ ప్లాట్ఫామ్పై ఒక వీడియో ద్వారా తప్పుడు, తప్పుదోవ పట్టించే, హానికరమైన కంటెంట్ను ప్రచురించి, ప్రచారం చేసిందని తెలిపారు.
ఆ యూట్యూబ్ ఛానల్పై చర్య తీసుకోవాలని నటి తన ఫిర్యాదులో కోరారని వెల్లడించారు. నటి విష్ణుప్రియ చేసిన ఫిర్యాదులో ఆన్లైన్ వేధింపులను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వక్రీకరించిన వాస్తవాలు, ఊహాజనిత ప్రకటనలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలతో కూడిన కంటెంట్ను ఆ ఛానల్ సృష్టించిందని తెలిపింది. విష్ణు ప్రియ ఫిర్యాదు ఆధారంగా, మియాపూర్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 , 67(ఎ) కింద కేసు నమోదు చేశారు. యూట్యూబ్లో అందుబాటులో ఉన్న తమ వీడియో ద్వారా పిటిషనర్కు సంబంధించి తప్పుడు, తప్పుదోవ పట్టించే, సంచలనాత్మక , హానికరమైన కంటెంట్ను ప్రచురించి, వ్యాప్తి చేస్తున్న ‘ప్లే లైక్ ఇంకగ్నిటో’ యూట్యూబ్ ఛానెల్పై తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ ఈ కేసు వివరాలు అందులో ఉన్నాయి.
