చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. మొన్న ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత భారతీరాజా కన్నుమూశారు. ఈ దుఃఖం నుంచి కోలుకోక ముందే మరో విషాద వార్త మోసుకు వచ్చింది. అనుభవజ్ఞులైన తమిళ చిత్ర నిర్మాత, రచయిత కె. భాగ్యరాజ్ శనివారం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన వయసు 73 ఏళ్లు. ఒక రకంగా తమిళ చలనచిత్ర పరిశ్రమ తన అత్యంత ప్రసిద్ధ సృజనాత్మక ప్రతిభావంతులలో ఒకరిని కోల్పోయింది. పలువురు తన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తమిళ సినిమాల్లో అత్యంత ప్రభావ వంతమైన చిత్ర నిర్మాత-నటులలో ఒకరిగా గుర్తింపు పొందారు భాగ్యరాజ్, మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో కూడిన చిత్రాలు, పదునైన స్క్రీన్ ప్లే రచన , సామాజిక ఇతివృత్తాలతో కూడిన కథన శైలికి ప్రసిద్ధి చెందారు.
1980, 1990లలో తమిళ సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి తను తీసిన, చేసిన మూవీస్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కృష్ణస్వామి భాగ్యరాజ్గా జన్మించిన ఆయన, దిగ్గజ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయకుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘సువరిల్లాద చిత్తిరంగల్’, ‘ముందనై ముడిచ్చు’, ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘అంద 7 నాట్కల్ , ‘ఇదు నమ్మ ఆలు’ వంటి చిత్రాలతో విజయవంతమైన దర్శకుడిగా ఎదిగారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు, 75కి పైగా చిత్రాలలో నటించడమే కాకుండా, తమిళ సినిమాలోని అత్యుత్తమ స్క్రీన్ ప్లే రచయితలలో ఒకరిగా కూడా భాగ్యరాజ్ ఎంతో గౌరవం పొందారు. ఆయన భార్య నటి పూర్ణిమ భాగ్యరాజ్ . పిల్లలు శాంతను, శరణ్య .తమిళ చలనచిత్ర పరిశ్రమ తన మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.