#Narayanamurthy : రైతే బంద్ చేస్తే దేశం ఏమయిపోతుందో చెప్పే రైతు బంద్‌

కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకు రావడం వల్ల దేశంలో వున్న వ్యవసాయం అంత కార్పొరేట్ మయం అయిపోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేసారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి

Narayanamurthy: కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకు రావడం వల్ల దేశంలో వున్న వ్యవసాయం అంత కార్పొరేట్ మయం అయిపోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేసారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట చిత్రాల‌ను నిర్మించే ఆయ‌న తాజాగాఢిల్లీ లో జ‌రుగుతున్న రైతాంగ‌పోరాట‌మే క‌థ‌గా మ‌ల‌చుకుని త‌నే హీరోగా నటిస్తూ స్వీయదర్శ కత్వంలో నిర్మిస్తున్న సినిమా `రైతు బంద్` షూటింగ్ పూర్తి చేసుకొని, శ‌ర‌వేగంగాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప‌నులు దగ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించుకుంటున్నారు.

ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో జ‌రిగిన మీడియా సమావేశం లో ఆర్.నారాయణమూర్తి (Narayanamurthy)మాట్లాడుతూ “ఏవైతే రైతులకు మేలు జరుగుతాయి అని కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందో అవి రైతులకు శాపాలు మాకు ఉరితాడుగా మార‌బోతున్నాయ‌ని, వాణిజ్య పరంగా మీరు ఎవరికైతే వెసులుబాటు కల్పిస్తున్నా రో వాళ్ళు మొత్తం సరుకుని రైతు దగ్గర కొని కృత్రిమ కొరత సృష్టించి రైతులను ప్రజలను ముంచేస్తార‌ని హెచ్చ‌రించారు.

ఒకే భారత్ ఒకే మార్కెట్ అంటున్నారు. రైతు పండించే పంట ను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఏ రేటు కైన అమ్ముకోవచ్చు అంటున్నారు. కానీ దీనిని అడ్డుపెట్టుకుని బాగుబ‌డేది మీ కార్పోరేట్‌లే అని గుర్తెరిగిన పంజాబ్,ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదలగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో పెద్ద ఉద్యమం జరుపుతున్నార‌ని చెప్పారు దేశంలో వ్యవసాయ రంగం 75% నుంచి 60% ప‌డిపోయింది . ఈ 60% లో కూడా కౌలు రైతులు 40% కొచ్చారు. వీళ్లంతా అప్పులు చేసి పంట‌పండించి పంటలు రాగానే వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకునేవాళ్లే న‌ని అన్నారు.

మార్కెట్ యార్డులు మన దేశంలో పల్లెల్లో జిల్లాల్లో ఒక కార్మిక బడులాగా ఆస్పత్రులు లాగా రైతులకోసం పనిచేస్తున్నాయి మీరు తెచ్చిన‌ చట్టాలతో మార్కెట్ యార్డులు మూత బ‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పంట‌లు కొనుగోలు చేయ‌వు, ద‌ళారులుండ‌రంటునే కార్పొరేట్ శ‌క్తుల‌ను ప్రోత్స‌హిస్తే రైతు ఏమైపోతాడు.రైతు రక్షణ కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఎందుకు అమ‌లు చేయ‌ర‌ని ప్ర‌శ్నించారు.రైతు కి గిట్టుబాటు ధర క‌ల్పించాల‌ని స్వామినాథన్ కమిటీ సిఫార్స్ ఆనాడు వున్న యూపీఏ గవర్నమెంట్ అమలు చేయలేదు. ఆతరువాత వచ్చిన ఎన్‌డీఏ గవర్నమెంట్ ఎన్నికల ముందు అధికారంలో కి వస్తె స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను అమలు చేస్తాము అని చెప్పి,. కానీ ఆ స్వామినాథన్ కమిటీ సిఫార‌స్సులు ప‌క్క‌న పెట్టి శాంతా రామ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ శాంతా రామ్ కమిటీ సిఫార్స్ మేరకే కొత్త వ్యవసాయ చట్టాలు రూపొందాయ‌ని ఆరోపించారు.

ఇప్పటి వరకు రైతులకు కేంద్రానికి 6,7సార్లు చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. రైతు కోరికలను మన్నించని ప్ర‌న‌నిభుత్వం ఇదొక్క‌టే ఇదేమి ప్రజా స్వామ్యం ఈన్న‌రు. లాక్‌డౌన్ వేళ‌ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు చాలా పార్టీలు టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే, అనేక పార్టీలు బిల్లులు ప్రవేశ పెట్టొద్దు సెలక్ట్ కమిటీకి పంపాల‌ని చెప్పినా ఖతార్ చేయకుండా ఈ రైతు సంఘాలను పిలవకుండా , క‌నీసం మాట్లాడ‌కుండా హ‌డావిడిగా ఆమోద ముద్ర వేసి జనాల మీద రుద్దుతున్నార‌ని అన్నారు.

ఇప్పటికే మన దేశంలో విద్య, వైద్య, విమానయానం, నౌకా యానాం అన్ని కూడా ప్రవేట్ పరం అయిపోయాయి.ఈ రోజు వ్యవసాయం కూడా ప్రవేటు పరం అయితే ఈ దేశం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోతుంది. అయ్య గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారూ శిరస్సు వహించి దణ్ణం పెడుతున్న. అందరూ స్వేచ్చగా హ్యాపీగా వుండాలి అంటే ఈ మూడు చట్టాలను రద్దు చెయ్యండి అని విజ్ఞపి చేస్తున్నా అని చెప్పారు.

ఇప్పటికే తెలంగాణా లో , ఆంధ్ర ప్రదేశ్ లో , ఒడిస్సాలో, ఢిల్లీలో, ప‌శ్చిమ‌బెంగాల్‌లో అయా రాష్ట్రాలలో రైతులకోసం ప్ర‌భుత్వాలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు . ఇక విద్యుత్ సంస్కరణలు మాటున రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు పోతాయి అని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.

రైతే ఉద్యమం చేస్తే , రైతే బంద్ చేస్తే దేశం ఏమయిపోయింది. రైతే బంద్ చేస్తే ఏమిటి అన్నది నా సినిమా రైతు బంద్.నేను ఎన్న‌డూ చూడ‌ని రైతు ఉద్య‌మం జ‌రుగుతోంది ఇప్పుడుఇదే నా యి రైతు బంద్(Narayanamurthy) చిత్రం ద్వారా చూపిస్తున్నా , ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.షూటింగ్ మొత్తం పూర్తయింది.పిబ్రవరిలో రిలీజ్ చేస్తాం“ అన్నారు.

No comment allowed please