Adhir Ranjan Chowdhury : ‘దీదీ..మోదీ’ ఇద్దరూ ఒక్కటే – అధీర్
సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి సంచలన కామెంట్స్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు.
బయటకు మాత్రం ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కించేలా చేస్తున్నారని కానీ లోలోపట వీరిద్దరూ ఒక్కటేనని మండిపడ్డారు.
వారిద్దరి ఎజెండా ఒక్కటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి రానీయకుండా చేయడమేనని పేర్కొన్నారు ఎంపీ. దీదీ, మోదీ(PM Modi) ఇద్దరూ కలిసి రహస్య ఎజెండా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీరి ఆలోచనలు ఒక్కటే రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు అధీర్ రంజన్ చౌధరి. ఇదిలా ఉండగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, గవర్నర్ లతో కలిసి తేనేటి విందులో దీదీ పాల్గొన లేదా అని ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ బిల్లును ఎలా ప్రయోగించాలనే దానిపై కూడా ఈ ఇద్దరు క్లారిటీతో ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో జాతికి గౌరవ సూచకంగా భావించే జాతీయ చిహ్నాన్ని కూడా చివరకు మోదీ అవమాన పర్చడం దారుణమన్నారు ఎంపీ.
తనకు మెజారిటీ ఉందని ప్రధానమంత్రి అనుకుంటున్నారని కానీ ఇది రాచరికం కాదని ప్రజాస్వామ్య దేశమని గుర్తుంచు కోవాలన్నారు. దీనిని రాష్ట్రపతి లేదా స్పీకర్ ఆవిష్కరించాల్సి ఉంటుందన్నారు.
కానీ ఏనాడూ ప్రోటోకాల్ ను పాటించిన దాఖలాలు లేవని నిప్పులు చెరిగారు అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury).
Also Read : రాష్ట్రపతి కోసం బీజేపీ ఆదివాసీ జపం