Congress Dharna: ఎమ్మెల్యే సైదిరెడ్డిపై ఉత్తమ్ ఫైర్
కిడ్నాప్ యత్నం ఈసీకి ఫిర్యాదు
Congress Dharna : సూర్యాపేట జిల్లా – రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ దాడుల పరంపర కొనసాగుతోంది. నిన్న కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన బర్రెలక్క సోదరుడు, ఇతరులపై గుర్తు తెలియని దండగులు దాడులకు పాల్పడ్డారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైదిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Congress Dharna Uttam Kumar Reddy Reacted
తమ పార్టీకి చెందిన ప్రతినిధిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ ఆరోపించారు. పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
మేళ్ల చెరువు పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ(Congress) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్ రిపీట్ అవుతోందన్నారు. కేవలం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే ఉండాలని అనుకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక పోలీసులు, ఉన్నతాధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా రూల్స్ ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు మాజీ టీపీసీసీ చీఫ్.
Also Read : Arundhati Roy : అరుంధతీ రాయ్ కి కేంద్రం షాక్