అలాంటి పోస్ట్ పెట్టిన దేవి నాగవల్లి.. నెట్టింట వైరల్!

devi nagavalli about her social media followers

స్టార్ మా లో ఇటీవలే ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ 4 గురించి అందరికీ తెలిసిందే. కాగా ఈ షో పూర్తి చేసుకున్న తర్వాత అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తరువాత ఒక క్రేజీ ను సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా పలువురి కంటెస్టెంట్ లకు సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే అందులో పాల్గొన్న మరో కంటెస్టెంట్ దేవి నాగవల్లి ఓ పోస్ట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 4 లో ఎంట్రీ అయినా టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి. దేవి నాగవల్లి అంటే అందరూ మొదట ఆమె వ్యక్తిత్వం కంటే ముందు టీవీ9 ఛానల్ ను దృష్టిలో పెట్టుకొని ఆమెను మొదట్లో చాలా మంది వ్యతిరేకించారు. కాగా రాను రాను ఆమె వ్యక్తిత్వం గురించి నేరుగా చూడగలిగారు ప్రేక్షకులు. దీంతో ఆమె ముక్కుసూటి మనిషని, అందరితో కలిసిపోతుందని కానీ చూడటానికి ఆమె అలా అనిపిస్తుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.

బిగ్ బాస్ హౌస్ లో మొదట్లో ఈమె పై వ్యతిరేకత ఉండటంవల్ల ఓటింగ్ శాతం తక్కువగా ఉండేది. కానీ రెండు వారాల్లోనే ఆమె వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియగా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది. కాగా మూడో వారంలో నాగవల్లి ఎలిమినేట్ అవ్వగా.. పలువురు అభిమానులు మెహబూబ్ కోసం పంపించేలా చేశారని సోషల్ మీడియాలో తెలిపారు.

ఇటీవలే దేవి నాగవల్లి చేసిన పోస్టు తెగ వైరల్ గా మారింది. ఇంతకుముందు తన సోషల్ మీడియా ఖాతాలో ఫాలోయింగ్ తక్కువగా ఉండేది అంటూ.. బిగ్ బాస్ తర్వాత ఫాలోయింగ్ మరింత పెరిగింది అంటూ తెలిపింది. దాదాపు లక్షకుపైగా మంది దేవి నాగవల్లి ని ఫాలో అవుతున్నారు. కాగా ఈ విషయం గురించి ఉద్దేశిస్తూ.. నా పొలంలో లక్ష మొలకలు వచ్చాయి అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో తెలిపింది. ప్రస్తుతం తను చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

No comment allowed please