DK Shiva kumar : ప్ర‌జా గాయ‌కుడికి మ‌ర‌ణం లేదు – డీకే

క‌ర్ణాట‌క డిప్యూడీ సీఎం శివ‌కుమార్

DK Shiva kumar : ప్ర‌జా గాయ‌కుడు, యుద్ద నౌక గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం ప‌ట్ల దేశ వ్యాప్తంగా సంతాపం వ్య‌క్తం అవుతోంది. క‌వులు, గాయ‌కులు, ర‌చ‌యిత‌లు, జ‌ర్న‌లిస్టులు, సామాజిక నేప‌థ్యం క‌లిగిన నాయ‌కులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. ఒక శ‌కాన్ని త‌న ఆట‌, పాట‌ల‌తో ప్ర‌భావితం చేసిన అరుదైన జాన‌ప‌ద , జ‌నం మెచ్చిన గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అని పేర్కొన్నాన‌రు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్(DK Shiva Kumar).

DK Shiva kumar Tributes to Gaddar

గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం పేద‌లు, పీడిత వ‌ర్గాల‌కు, అణ‌గారిన వ‌ర్గాల‌కు తీర‌ని న‌ష్టం అని వాపోయారు. ఆయ‌న మ‌ర‌ణం తెలంగాణ రాష్ట్రానికే కాదు యావ‌త్ దేశానికి తీర‌ని న‌ష్టం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. గ‌ద్ద‌ర్ గానం సాధార‌ణ వ్య‌క్తుల‌తో నిత్యం ప్ర‌భ‌విస్తూనే, ప‌ల్ల‌విస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు డీకే శివ‌కుమార్.

ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. త‌మ పార్టీ కూడా ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేస్తోంద‌ని తెలిపారు. గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం త‌న‌ను మ‌రింత బాధ‌కు గురి చేసింద‌ని ఆవేద‌న చెందారు డీకే శివ‌కుమార్. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌స్తుతం గ‌ద్ద‌ర్ కు నివాళులు అర్పిస్తున్నారు. సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : Gaddar Singer : జ‌న గానం అజ‌రామ‌రం

Leave A Reply

Your Email Id will not be published!