DK Shivakumar : క‌న‌క‌పుర నుంచి బ‌రిలో డీకే

వ‌రుస‌గా ఏడుసార్లు ఎమ్మెల్యే

DK Shivakumar : క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ క‌న‌క‌పుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిల్చోనున్నారు. ఇవాళ ఆయ‌న త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు భారీ ఎత్తున రోడ్ షో చేప‌ట్టారు. వేలాది మంది జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. ఒక ర‌కంగా ఇది జాత‌ర‌ను త‌లపింప చేసింది.

ఇదే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీకే శివ‌కుమార్(DK Shivakumar) 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, ఇప్ప‌టికే పేరుకు పోయిన అవినీతిని రూపు మాపుతాన‌ని ప్ర‌క‌టించారు. 224 మంది స‌భ్యులు క‌లిగిన క‌ర్ణాట‌క‌లో క‌నీసం 150కి పైగా తాము గెలుపొంద‌డం ఖాయ‌మ‌న్నారు డీకే శివ‌కుమార్.

భార‌తీయ జ‌న‌తా పార్టీ, జేడీఎస్ ల ఎజెండా ఏమిటో నాకు తెలియ‌దు. ఇక్క‌డ వందలాది మంది నేత‌ల‌ను త‌యారు చేశాన‌ని అన్నారు. జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ , ల‌క్ష్మ‌ణ్ స‌వాడి లాంటి దిగ్గ‌జ బీజేపీ నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు . చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌చ్చేందుకు రెడీగా ఉన్నార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

కానీ త‌మ పార్టీలో స్థ‌లం లేకుండా పోయింద‌న్నారు. మ‌రో వైపు జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ , ల‌క్ష్మ‌ణ్ స‌వాది తో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని పేర్కొన్నారు ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే, మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య.

Also Read : కూట‌మి స‌రే కింగ్ పిన్ ఎవ‌రు

Leave A Reply

Your Email Id will not be published!