Eatala Rajender : కేసీఆర్ ఖేల్ ఖ‌తం – రాజేంద‌ర్

పేద‌లను మోసం చేసిన ఘ‌నుడు

Eatala Rajender : ఖుత్బుల్లాపూర్ – సీఎం కేసీఆర్ ప‌నై పోయింద‌ని, ఇక కాలం చెల్లిన నాయ‌కుడిగా మిగిలి పోవ‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఖుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అభ్య‌ర్థి కూన శ్రీ‌శైలం గౌడ్ కు మ‌ద్ద‌తుగా రోడ్ షోలో పాల్గొన్నారు.

Eatala Rajender Comments on KCR

బ‌స్తీ ప్ర‌జ‌లకు డ‌బుల్ బెడ్ రూమ్ లు ఇచ్చే ద‌మ్ము కేసీఆర్ కు లేద‌న్నారు. కానీ పేద‌లు వేసుకున్న గుడిసెల‌ను బ‌ల‌వంతంగా లాక్కోవ‌డం దారుణ‌మ‌న్నారు. అందుకే పేద‌ల ఉసురు త‌ప్ప‌క త‌గులుతుంద‌న్నారు.

ఎల్ల‌మ్మ బండ‌లో 250 ఎక‌రాల‌లో 160 ఎక‌రాలు పేద‌లుకు ఆనాటి ప్ర‌భుత్వాలు పంచాయ‌ని , మిగిలిన 92 ఎక‌రాల‌ను దేష్పాండే అనేటోడు రేకులు పాతే ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేను వచ్చి ఆ రేకుల‌ను పీకేశాన‌ని అన్నారు. కానీ కేసీఆర్ ఆ భూమిని వారికే క‌ట్ట బెట్టిండ‌ని ఆరోపించారు. రూ. 4,500 కోట్ల భూమిని బ్రోక‌ర్ల‌కు క‌ట్ట బెట్టిన కేసీఆర్ కు ఓటు వేస్తారా అని ప్ర‌శ్నించారు.

బంజారా హిల్స్ లో తాను రాములు నాయ‌క్ క‌లిసి ప్ర‌భుత్వ భూములు క‌బ్జా కాకుండా కాపాడు కున్నామ‌ని అన్నారు. కానీ ఈ సీఎం భూక‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : G Kishan Reddy : క‌మ‌లం విజ‌యం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!