Fire Incident : న్యూయార్క్ అగ్ని ప్రమాదంలో భారత జర్నలిస్ట్ మృతి..17 మందికి తీవ్ర గాయాలు

ఈ ఘటన అనంతరం ఫాజిల్ మృతి పట్ల భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది

Fire Incident : అమెరికాలోని ఓ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో 27 ఏళ్ల భారతీయ జర్నలిస్ట్ మరణించాడు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం మృతుడిని ఫాజిల్ ఖాన్‌గా గుర్తించింది. బైకులోని లిథియం-అయాన్ బ్యాటరీ పేలడమే భారీ అగ్నిప్రమాదానికి కారణమని అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదంలో న్యూయార్క్‌లోని హార్లెమ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Fire Incident Viral in New York

ఈ ఘటన అనంతరం ఫాజిల్ మృతి పట్ల భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలు, స్నేహితులతో మాట్లాడుతున్నట్టు సమాచారం. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంబసీ సోషల్ మీడియాలో ప్రకటించింది. జర్నలిజం చదవడానికి ఫాజిల్ 2020లో న్యూయార్క్ వెళ్లారు. అతను కొలంబియా జర్నలిజం స్కూల్‌లో తన కోర్సు పూర్తి చేసినప్పటి నుండి అక్కడే నివసిస్తున్నాడు.

Also Read : Minister Ponnam Prabhakar: వీఐపీల కారు డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్ష – మంత్రి పొన్నం

Leave A Reply

Your Email Id will not be published!