G Kishan Reddy : వ‌ర‌ద బాధితుల‌కు బీజేపీ భ‌రోసా

ప‌రామ‌ర్శించిన స్టేట్ చీఫ్ కిష‌న్ రెడ్డి

G Kishan Reddy : భారీ వ‌ర్షాల తాకిడికి అత‌లాకుత‌ల‌మైన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఆదివారం మోరంచ‌ప‌ల్లిని కిష‌న్ రెడ్డి సంద‌ర్శించారు. బాధితుల వ‌ద్ద‌కు వెళ్లారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. రూ. 4 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. గ‌ల్లంతైన మృత దేహాల కోసం గాలింపు చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ను ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త్వ‌రిత‌గ‌తిన ఆదు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జి. కిష‌న్ రెడ్డి.

G Kishan Reddy Said

ఇటీవ‌ల కురిసిన ఎడ తెరిపి లేని వ‌ర్షాల కార‌ణంగా భూపాల‌ప‌ల్లి జిల్లా తీవ్ర ఇబ్బందుల‌కు గురైంది. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర‌దలు, వ‌ర్షాల కార‌ణంగా ప‌లువురు ప్రాణాలు కోల్పోగా చాలా మంది గ‌ల్లంత‌య్యారు. ప్ర‌త్యేకించి వ‌ర‌ద‌ల ఉధృతికి చిక్కుకు పోయారు మోరంచ‌ప‌ల్లి గ్రామ‌స్తులు. వీరిని హెలికాప్ట‌ర్ల ద్వారా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

కాగా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు స‌ర్వ‌స్వం పోగొట్టుకున్న గ్రామ‌స్తుల‌ను చూసి చ‌లించి పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి(G Kishan Reddy). వ‌ర‌ద‌ల్లో చిక్కుకు పోయిన ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు తాను ఫోన్ చేసిన వెంట‌నే కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించార‌ని తెలిపారు. ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు.

Also Read : Director Shankar : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!