Minister KTR : అమ‌ర‌జ్యోతి డాక్యుమెంట‌రీ ఆవిష్క‌ర‌ణ

అమ‌ర వీరుల త్యాగాలు స్పూర్తి దాయ‌కం

Minister KTR : హైద‌రాబాద్ – తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టారు. విలువైన జీవితాల‌ను పారేసుకున్నారు. వీరుల త్యాగాల పునాదుల మీద కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. వేల మంది బ‌లిదానాలు చేసుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంగా వ‌చ్చింది తెలంగాణ రాష్ట్ర స‌మితి. ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Minister KTR Comment

ఈ త‌రుణంలో తెలంగాణ అమ‌ర వీరుల త్యాగాల‌ను కొనియాడుతూ నిర్మించారు అమ‌ర జ్యోతి పేరుతో డాక్యుమెంట‌రీని. దీనిని ఆదివారం ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). 10 నిమిషాల నిడివి క‌లిగిన ఈ డాక్యుమెంట‌రీలో 1969 నుంచి రాష్ట్రావ‌త‌ర‌ణ వ‌ర‌కు సాగిన ఉద్య చ‌రిత్ర‌లో ప్రాణ త్యాగం చేసిన అమరుల ఔన్న‌త్యాన్ని అద్భుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు.

స‌మైక్య వాదుల కుట్ర‌ల ఫ‌లితంగా యువ‌కులు బ‌లిదానాలు చేసుకున్నారు. ఇందుకు దారి తీసిన ప‌రిస్థితుల‌ను ఇందులో వివ‌రించారు. విద్యార్థి వీరుల త్యాగ నిర‌తిని గుండెలు ద్ర‌వించేలా ఈ అమ‌ర జ్యోతి డాక్యుమెంట‌రీని తీశారు. దీనికి ర‌చ‌న స‌హ‌కారంతో పాటు వ్యాఖ్యానం చేశారు ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్. అమ‌ర జ్యోతి డాక్యుమెంట‌రీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు బాదావ‌త్ పూర్ణ చంద్ . వీరిని అభినందించారు మంత్రి కేటీఆర్.

Also Read : Telangana Secretariat : తెలంగాణ స‌చివాలయం అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!