Patnam Mahender Reddy : కేటీఆర్ తో ప‌ట్నం భేటీ

దుబాయ్ నుంచి తిరొగిచ్చిన మంత్రి

Patnam Mahender Reddy : హైద‌రాబాద్ – ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గంలో కేబినెట్ హోదా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి హైద‌రాబాద్ లో ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ను క‌లుసుకున్నారు.

Patnam Mahender Reddy Meet KTR

ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి(Patnam Mahender Reddy) గ‌నుల శాఖను అప్ప‌గించారు సీఎం కేసీఆర్. దుబాయ్ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చాక క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మంత్రి. పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి మంచి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

ఇటీవ‌ల అమెరికాలో ప‌ర్య‌టించారు మంత్రి. ఆ త‌ర్వాత దుబాయ్ కి వెళ్లారు. ప‌లు దిగ్గ‌జ కంపెనీల‌ను సంద‌ర్శించారు. ఆయా కంపెనీల ప్ర‌తినిధుల‌తో ముచ్చ‌టించారు. పెద్ద ఎత్తున పెట్ట‌బడులు రాష్ట్రానికి వ‌చ్చేలా చేశారు మంత్రి కేటీఆర్.

ఇందులో కేర‌ళ‌కు చెందిన మ‌ల‌బార్ గ్రూప్ హైద‌రాబాద్ లో రూ. 125 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కేటీఆర్ తో ఒప్పందం చేసుకున్నారు. ఇదే క్ర‌మంలో ప‌లువురు తెలంగాణ‌కు చెందిన వారు దుబాయ్ లో జైలు లో ఉన్న వారిని విడుద‌ల చేయాల‌ని కోరుతూ వ‌చ్చారు మంత్రి కేటీఆర్.

తాజాగా మంత్రిగా కొలువు తీరిన మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి కేటీఆర్ ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : Jayaraj Selected : జ‌య‌రాజ్ కు కాళోజీ పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!