యువత కృషి చేస్తే సక్సెస్ సాధ్యం : సత్యకుమార్
దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్న ఆరోగ్య మంత్రి
విజయవాడ : యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సహకారం చేసుకునే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి జయంతి సందర్బంగా ఆదివారం బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవాడలో మారథాన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 5కె మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్లాలని అన్నారు. కష్టపడితే యువత కొండలను సైతం పిండి చేయవచ్చని అన్నారు.
ఈ దేశ నిర్మాణం జాతి నిర్మాణం చేయాలంటే యువత కీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు మంత్రి సత్య కుమార్ యాదవ్. అందుకు అణుగుణంగానే నేడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అంశాల్లో యువతను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాయని చెప్పారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక యువతకు పెద్ద పీట వేస్తూ అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ రాణించేలా సహకారం అందిస్తున్నారని అన్నారు మంత్రి. యువత లో ఉన్న మేధోశక్తిని బయటకు తీస్తూ వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు సత్య కుమార్ యాదవ్. ప్రపంచ దేశాల్లో మన యువత ముందు ఉండేలా కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. కేంద్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కూడా యువతకు వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
