#PawanKalyan : జనగణమన సినిమాతో రాబోతున్న పవన్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మరో రెండు సినిమాలను పట్టాలెక్కించాడు.

PawanKalyan : పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తూ జట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు వైరం తీసుకుని వకీల్ సాబ్ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. అంతేకాదు త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మరో రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అయ్యప్పనుమ్ కొశీయుమ్ అనే రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ 40 రోజుల్లోనే పూర్తి చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేస్తున్నాడు. అంతేకాదు హరీష్ శంకర్, అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయబోతున్నాడు. అంతేకాదు వీటితోపాటు మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

ఇది ఇప్పటి కథ కాదు. దాదాపు పది సంవత్సరాల క్రితం రావాల్సిన కథ. డైరెక్టర్ పూరీ జనగణమన అనే సినిమాను తీసుకురావడానికి చాలా కలం నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది మహేష్ బాబుతో చేయాలనీ పూరీ భావించిన మహేష్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు పవన్ ఇలాంటి సందేశాత్మక చిత్రాలను తీయాలనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ వార్తలో నిజమెంతో..

No comment allowed please