#NTR : RRR తర్వాత మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న తారక్

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు.

NTR : జూనియర్ ఎన్టిఆర్ ప్రస్తుతం దర్శకధీరుదు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మరో కధానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్నాడు. అయితే తారక్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఎన్టిఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. మే 20 తన పుట్టినరోజు సందర్భంగా సినిమా మొదలు పెట్టి ఈ సంవత్సరంలోనే పూర్తి చేయాలనీ తారక్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా మూవీ చేయాలనీ ఎన్టిఆర్ అనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే పూర్తికానున్న నేపథ్యంలో వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే ఈ సినిమా మొదలు పెట్టాలని ఎన్టిఆర్ భావిస్తున్నాడు. చూడాలి మరి ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో..

No comment allowed please