Rahul Gandhi : ప్రజలే దేవుళ్లు దేశమే నా ఇల్లు
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
Rahul Gandhi : తెలంగాణ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ, సంకీర్ణ సర్కార్ ను ఏకి పారేశారు.
Rahul Gandhi Comment
తాను ప్రజలను నమ్ముకున్నానని, చివరకు తనపై కేంద్రం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. జన సంక్షేమమే తన అభిమతమని పేర్కొన్నారు. దేశానికి చెందిన 140 కోట్ల మంది ప్రజలను తాను దేవుళ్లుగా భావిస్తానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
తాను మోదీని విమర్శించానంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆవేదన చెందారు. ఇదే సమయంలో కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు కల్పించిందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
కానీ మోదీ ప్రశ్నించే వాళ్లను ఒప్పుకోడని, అందుకే తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. అయినా తాను ఎక్కడా తల వంచ లేదన్నారు. తనకు ఇల్లు లేకుండా చేసినా తనకు దేశమే ఇల్లు అని పేర్కొన్నారు.
Also Read : Ravula Chandrasekhar Reddy : అయ్యో రావుల ఎందుకిలా