Revanth Reddy : ప్ర‌జాలారా రండి ఆశీర్వ‌దించండి

టీపీసీసీ చీఫ్‌..సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

Revanth Reddy : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ , నూత‌న సీఎంగా ఎంపికైన రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు బ‌హిరంగ లేఖ రాశారు. యావ‌త్ ప్ర‌జానీకం స్వ‌చ్చంధంగా హైద‌రాబాద్ లో డిసెంబ‌ర్ 7న గురువారం లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో జ‌రిగే ప్ర‌జా కృత‌జ్ఞ‌త స‌భ‌కు త‌ర‌లి రావాల‌ని కోరారు.

Revanth Reddy Invites People

ఇందిర‌మ్మ రాజ్యం స్థాప‌న‌కు స‌మ‌యం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఒక మామూలు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన త‌న‌ను ఇంత‌టి ఉన్న‌త స్థాయికి చేరుకునేలా చేసినందుకు ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు.

రాక్ష‌స , గ‌డీల పాల‌న‌కు తెర దించినందుకు ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇక నుంచి ప్ర‌జ‌లంతా స్వేచ్చతో, స్వతంత్రంగా ఉండ‌వ‌చ్చ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని తెలిపారు.

తాము ఇప్ప‌టికే ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. విద్యార్థుల పోరాటం, అమ‌రుల త్యాగం, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ లో పార‌ద‌ర్శ‌క పాల‌న ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Pawan Kalyan Chandrababu : బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!