SRH SQUAD IPL 2024 : బ‌ల‌మైన ఆట‌గాళ్ల‌తో హైద‌రాబాద్

భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సిఇవో

SRH SQUAD IPL 2024 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట ముగిసింది. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH). రూ. 20.50 కోట్ల‌కు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ ను చేజిక్కించుకునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర్చారు జ‌ట్టు సిఇవో కావ్య మార‌న్. ఒక ఆట‌గాడిపై ఇంత పెద్ద మొత్తంలో ఆఫ‌ర్ ఇవ్వ‌డం విస్తు పోయేలా చేసింది. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే అత్యంత బ‌ల‌మైన ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టు ఉండ‌డం విశేషం.

SRH SQUAD IPL 2024 Updates

ఇదిలా ఉండ‌గా రూ. 34 కోట్ల‌తో వేలం పాట‌లోకి ప్ర‌వేశించింది. ఇందులో చాలా తెలివిగా క‌మిన్స్ ను కైవ‌సం చేసుకోగా మిగ‌తా వాళ్ల‌కు మిగిలిన మొత్తాన్ని కేటాయించేలా చేసింది. ట్రావిస్ హెడ్ ను రూ. 6.80 కోట్లు , వ‌నిందు హ‌స‌రంగా కు రూ. 1.50 కోట్లు, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ కు రూ. 1.60 కోట్లతో కైవ‌సం చేసుకుంది.

ఇక ఆకాష్ సింగ్ ను రూ. 20 ల‌క్ష‌ల‌కు, జాత‌వేద్ సుబ్ర‌మ‌ణ్య‌న్ రూ. 20 ల‌క్ష‌లకు తీసుకుంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే .. క్లాసెన్ , స‌న్వీర్ సింగ్ , ఫిలి\ప్స్ , భువీ, మ‌యాంక్ , టి. న‌ట‌రాజ‌న్ , అన్మోల్ ప్రీత్ , ఉపేంద్ర సింగ్ , ఉమ్రాన్ , నితీష్ కుమార్ , ఫ‌రూఖీ, షాబాజ్ , హెడ్ , వాన్ , ప‌ట్మిన్ , ఉనాద్క‌త్ , ఆకాష్ సింగ్ , ఝూత‌వేద్ , స‌మ‌ద్ , అభిషేక్ , మార్క్రామ్ , జాన్స‌న్ , త్రిపాఠి, సుంద‌ర్ ఉన్నారు.

Also Read : Telangana Assembly : 42 పేజీల‌తో శ్వేత ప‌త్రం విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!