Swaroopananda Swamy : కనక దుర్గమ్మ జగన్మాత
శారదా పీఠాధిపతి స్వరూపానంద
Swaroopananda Swamy : విజయవాడ – విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని శక్తి పీఠాలలో కెల్లా ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత కనక దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత అని అన్నారు.
నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మ వారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చారు భక్తులకు. ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్త బాంధవులతో నిండి పోయింది. ఈ సందర్బంగా శారదా పీఠం అధిపతి స్వరూపానంద సరస్వతి జగన్మాతను దర్శించుకున్నారు.
Swaroopananda Swamy Comment
అంతకు ముందు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో కేఎస్ రామారావు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో ఆహ్వానించారు స్వామి వారిని. దర్శనం అనంతరం స్వరూపానంద స్వామీజీకి శ్రీ కనక దుర్గమ్మ(Sri Kanaka Durgamma) అమ్మ వారి చిత్ర పటం, శేష వస్త్రాన్ని అందజేశారు.
మీడియా పాయింట్ వద్ద స్వరూపానంద సరస్వతి మాట్లాడారు. జగన్మాతకు పేదలు అంటే ఇష్టమని చెప్పారు. దేవస్థానం ఉన్నత స్థాయి భక్తులతో పాటు పేద వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం ప్రతి రోజూ కొంత సమయాన్ని దర్శనం కోసం కేటాయించాలని స్పష్టం చేశారు.
Also Read : RK Roja Selvamani : కళాకారుల ప్రదర్శన అద్భుతం