Women Shot Delhi Court : ఢిల్లీ కోర్టులో మ‌హిళ‌పై కాల్పులు

ఆర్థిక వివాదాలే కార‌ణం

Women Shot Delhi Court : ఢిల్లీ కోర్టు ఆవ‌ర‌ణ‌లో శుక్ర‌వారం కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హిళపై కాల్పుల‌కు(Women Shot)  పాల్ప‌డ్డారు. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నైరుతి ఢిల్లీలోని ద్వార‌క‌లో బైక్ పై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక న్యాయ‌వాదిని కాల్చి చంపిన కొద్ది రోజుల త‌ర్వాత ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దాడికి పాల్ప‌డిన వారు కోర్టులోకి ప్ర‌వేశించేందుకు లాయ‌ర్ల వేషంలో వ‌చ్చారు.

ఢిల్లీ లోని కోర్టు కాంప్లెక్స్ లో ఉద‌యం కాల్పుల‌కు పాల్ప‌డ్డారు దుండ‌గులు. వెంట‌నే అక్క‌డ ఉన్న పోలీసు అధికారి బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న సాకేత్ లోని జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. ఆర్థిక వివాదానికి సంబంధించిన కేసు విచార‌ణ కోసం కోర్టులో ఉన్న మ‌హిళ‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు( Women Shot Delhi Court). నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు జాతీయ మీడియా సంస్థ ఎఎన్ఐ తెలిపింది.

ఇదిలా ఉండ‌గా దేశ రాజ‌ధానిలో కోర్టు ఆవ‌ర‌ణ‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ఆందోళ‌న‌క‌రంగా మారాయి. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 24న రోహిణిలోని కోర్టు గ‌దిలో గ్యాంగ్ స్ట‌ర్ జితేంద‌ర్ మాన్ అలియాస్ గోగిపై లాయ‌ర్ల వేష‌ధార‌ణ‌లో ఉన్న ముష్క‌రులో ప‌లు బుల్లెట్లు పేల్చారు. పోలీసులు ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

Also Read : ఆంధ్రా విద్యార్థి కాల్చివేత‌

Leave A Reply

Your Email Id will not be published!