Yarlagadda Lakshmi Prasad(YLP) : యార్లగడ్డకు జాతీయ పురస్కారం
అందుకున్న రాజేంద్ర స్మారక అవార్డు
Yarlagadda Lakshmi Prasad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ తెలుగు, హిందీ రచయిత , పద్మ భూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు అరుదైన పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఇచ్చే రాజేంద్ర స్మారక విశిష్ట అవార్డును స్వీకరించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి (కాశీ) కేంద్రంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం హిందీ విభాగం అధ్యక్షుడు సదా నంద శాస్త్రి, మహా మహోమహాపధ్యాయ రాధా వల్లభ త్రిపాటిల నుండి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దంపతులు ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు.
ఇదిలా ఉండగా హిందీ భాష అభివృద్దికి జాతీయ స్థాయిలో విశేషంగా కృషి చేస్తోంది నాంది పత్రిక. ఇందులో భాగంగా పత్రికకు సంబంధించి నాంది సేవా ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ప్రతి సంవత్సరం విశిష్ట పురస్కారాలను అందిస్తూ వస్తోంది. ఈ అవార్డులో భాగంగా నాంది సేవా ట్రస్ట్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్(Yarlagadda Lakshmi Prasad) కు లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందజేసింది.
ఈ సందర్భంగా అవార్డును స్వీకరించిన అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తర భారతం లోని వారు ఏదో ఒక దక్షిణ భారతీయ భాషను అభ్యసించాలని హితవు పలికారు. హిందీ తర్వాత ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే భాష తెలుగు అని స్పష్టం చేశారు. ప్రాచీన భాష హోదా కలిగిన ఆరు భాషలలో తెలుగు ఒకటని పేర్కొన్నారు. ట్రస్ట్ అధ్యక్షురాలు శశి కళా పాండే పాల్గొన్నారు.
Also Read : India ICC World Cup 1983 : చరిత్రాత్మకం చిరస్మరణీయం