IndiGo: హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు !

హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు !

IndiGo: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ లో అత్యవసరంగా దించేశారు.

IndiGo…

ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఇండిగో(IndiGo) విమానం జబల్‌పుర్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లోకి వెళ్లగా కమోడ్‌ సీటుపై ఓ పేపర్‌ కన్పించింది. దానిపై ‘బ్లాస్ట్‌’ అని రాసి ఉండటంతో వెంటనే సిబ్బందికి చెప్పారు. అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారమిచ్చారు. అనంతరం విమానాన్ని నాగ్‌పుర్‌కు మళ్లించారు.

ఉదయం 9.20 గంటలకు విమానం నాగ్‌పుర్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ సిబ్బంది, అంబులెన్స్‌లను విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను దించి వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విమానంలో 69 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను బస్సులో హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.

Also Read : Heavy Rains in AP: తెలంగాణ-ఏపీ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు !

Leave A Reply

Your Email Id will not be published!