Mukesh Ambani-Jio : మరో సంచలనమైన సర్ప్రైజ్ తో మార్కెట్ ను షేక్ చేయనున్న జియో
ఈసారి జియో లక్ష్యం భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ను ప్రభావితం చేయడమే...
Mukesh Ambani : ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోంది. ప్రతిరోజూ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్లు వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి మొబైల్ తయారీ సంస్థలు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి జియో లక్ష్యం భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ను ప్రభావితం చేయడమే.
Mukesh Ambani – Jio Updates
ఇప్పటికే 4G, 5G, ఫీచర్ ఫోన్ విభాగాల్లో కీలక పాత్ర పోషించిన ముఖేష్ అంబానీ(Mukesh Ambani) నేతృత్వంలోని జియో సంస్థ ఇప్పుడు స్మార్ట్ఫోన్ విభాగంపై దృష్టి సారించింది. గతంలో అనేక స్మార్ట్ఫోన్లను విడుదల చేసినప్పటికీ, ఈసారి జియో ఫోన్ 5Gపై ప్రత్యేకంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ ఫోన్లో సాధారణంగా రూ.30,000 ధరల ఫోన్లలో మాత్రమే కనిపించే ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. అంతేకాదు, దీని ధర సుమారుగా రూ.2,500గా ఉండే అవకాశముంది.
వచ్చిన లీకుల ప్రకారం, జియో ఫోన్ 5Gలో 200 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉండొచ్చని చెబుతున్నారు. ఇది సాధారణంగా హైఎండ్ ఫోన్లలో మాత్రమే కనిపిస్తుంది. దీని వల్ల ఫోటోలు చాలా నాణ్యతతో రావచ్చు. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుందని చెబుతున్నారు, ఇది మిడ్-రేంజ్ ఫోన్లతో పోల్చితే మెరుగైనదే. DSLR తరహా కెమెరా అనిపించవచ్చని టెక్ నిపుణుల అభిప్రాయం.
ఈ ఫోన్ 7200mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. ఇది చాలా తక్కువ ధర ఫోన్లలో దొరకని బ్యాటరీ సామర్థ్యం. అలాగే 120W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఉండనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది విద్యుత్ కొరత ఉన్న ప్రాంతాల్లో ఉండే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
జియో ఫోన్ 5G మిడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది యూట్యూబ్, మల్టీటాస్కింగ్, లైట్ గేమింగ్ వంటి సాధారణ పనులకు సరిపోతుంది. దీనిలో 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఉండే అవకాశముందని చెబుతున్నారు.
ఇది 5.5 అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేతో రానుంది. దీనిలో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని సమాచారం. అంటే ఈ ఫోన్ ద్వారా ఇతర ఫోన్లను ఛార్జ్ చేయొచ్చు.
ఇన్ని ఫీచర్లు ఈ ధరలో అందుబాటులో ఉంటే, జియో ఫోన్ 5G భారత బడ్జెట్ ఫోన్ మార్కెట్ను శాసించగలదు. బేస్ మోడల్ ధర సుమారు రూ.4,999 నుండి రూ.5,999 మధ్య ఉండొచ్చని అంచనా. కానీ రిబేట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డేటా బండిల్లతో ఈ ధర రూ.999 నుండి రూ.1,199కి తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనితో జియో ఫోన్ 5G అత్యంత చౌకగా లభ్యమయ్యే హైఎండ్ ఫీచర్లతో కూడిన 5G ఫోన్గా మారనుంది.
Also Read : Venkaiah Naidu : అమరావతికి భూములిచ్చిన రైతులపై అలాంటి వ్యాఖ్యలు సరికాదు