పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్

మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో కీలకంగా భావిస్తున్న పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుండి కొకెయిన్ తెప్పించినట్లుగా.. తానేవెళ్లి తీసుకువచ్చినట్లుగా విచారణలో పోలీసులకు చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి సహాయకుడు, డ్రైవర్ సిల్వేరి శరత్ కుమార్ కీల‌కంగా ఉన్నారు.
సిమ్లా నుండి తానే డ్రగ్స్ తీసుకు వచ్చినట్లుగా పోలీసులను తప్పుదోవ పట్టించాడు రోహిత్ స్నేహితుడు బెంగళూరు వ్యాపారి కౌశిక్ రవి.

డ్రైవర్ శరత్ చెప్పిన వివరాల ఆధారంగా అభిషేక్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించుకున్నారు పోలీసులు. గత నాలుగు రోజులుగా అభిషేక్ గురించి వెతుకుతున్నారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా అభిషేక్ ఆచూకీ కనుగొన్న సిట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా డ్ర‌గ్స్ కేసులో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురికి డ్ర‌గ్స్ పరీక్ష‌ల్లో పాజిటివ్ వ‌చ్చిందని తేల్చారు. ఈ కేసులో స్టేష‌న్ బెయిల్ ఇచ్చారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాద‌వ్. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. త‌న‌ను కోర్టు ముందు హాజ‌రు ప‌ర్చ‌డంతో రిమాండ్ విధించారు.

గ‌తంలో కూడా డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నారు మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి. గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో ఫామ్ హ‌జ్ ల‌లో డ్ర‌గ్స్ దందాల కొన‌సాగుతూ వ‌చ్చాయి.

Leave A Reply

Your Email Id will not be published!