నియోజకవర్గాల పునర్విభజనపై ఏకాభిప్రాయం సాధించాలి
కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర సర్కార్ నిర్వాకంపై సీరియస్ కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కీలకమైన విధానాన్ని అన్యాయంగా ముందుకు నెట్టే బదులు, అన్ని పార్టీల అభిప్రాయంతో మొదలుపెట్టి జాతీయ ఏకాభిప్రాయం సాధించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ముందుకు నెట్టే బదులు, అన్ని పార్టీల అభిప్రాయంతో మొదలుపెట్టి జాతీయ ఏకాభిప్రాయం సాధించాలని ఇక్కడ అన్నారు. ప్రతి ఒక్కరూ మద్దతిచ్చే మహిళా రిజర్వేషన్లు, అనేక ఆందోళనలు ఉన్న లోక్సభ సీట్ల పునర్విభజన వేర్వేరని ప్రతి పౌరుడికి స్పష్టంగా తెలుసు అని స్పస్టం చేశారు సీఎం.
రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే, యావత్ దేశం దానిని స్వాగతిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ను ఒక తప్పుదారి పట్టించే అంశంగా వాడుకుంటూ, లోక్సభ నియోజకవర్గాల జనాభా ఆధారిత జాతీయ పునర్విభజనను ముందుకు నెట్టే ప్రయత్నాలు చాలా స్వల్పకాలంలో బీజేపీకి ప్రయోజనం చేకూర్చవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అది దక్షిణ, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తే, దీర్ఘకాలంలో మన దేశాన్ని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. ఏ పార్టీ ప్రయోజనాలకైనా జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. విస్తృత, దీర్ఘకాలిక దృష్టితో, లోక్సభ పునర్విభజన కోసం కేవలం దామాషా పద్ధతి కాకుండా ఇతర నమూనాలను పరిగణించాలని కోరారు.
