చెన్నై : భారత జట్టు మాజీ క్రికెటర్ , యూట్యూబర్ , అనలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఇండియాలో జరిగిన అత్యంత జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) మెగా టోర్నమెంట్ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలుచు కోవడం. అయితే గత ఏడాది ఐపీఎల్ టోర్నీలో ఆశించిన మేర రాణించ లేదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈసారి మాత్రం కాస్తంత మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కానీ జట్టును రూపొందించడంలో మెంటార్, హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ వైఫల్యం చెందాడని రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఎక్కువ ధరకు ఆటగాళ్లను కొనుగోలు చేయడం కంటే తక్కువ ధరకు తీసుకుని వారితో ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
వేలం వ్యూహాలను పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నాడు.వెంకటేష్ అయ్యర్ , జాసన్ హోల్డర్లను ఒక్కొక్కరికి ₹7 కోట్లకు కొనుగోలు చేసి ఫైనల్కు చేరుకున్నాయి. ఇద్దరు ఆటగాళ్లపై ₹14 కోట్లు ఖర్చు చేసే బదులు, వారు యువత , అనుభవం కలయికను ఎంచుకుని ఉండవచ్చు. జట్టు ఎప్పుడూ సరిగ్గా కలిసికట్టుగా ఆడలేదని మండిపడ్డాడు ఆర్. అశ్విన్. పాత్రల స్పష్టత విషయంలో స్పష్టమైన సమస్యలు ఉన్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే పలు జట్లు గాయాల బారిన పడ్డాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్కు గాయాలు కొత్తేమీ కాదన్నాడు. సీజన్ ప్రారంభమైన తర్వాత వారి ఆటగాళ్లు దెబ్బతిన్నారు. వారు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఆ ఎదురు దెబ్బలను అధిగమించ లేకపోయారు, మరియు గాయాలు ఫ్రాంచైజీకి ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లను అనుచితమైన బ్యాటింగ్ స్థానాలు, పాత్రలలో కూడా ఉపయోగించారు. డెవాల్డ్ బ్రెవిస్ , శివమ్ దూబేలను ఫినిషర్లుగా నియమించాలనే నిర్ణయం జట్టు ప్రణాళిక మరియు నిర్ణయాలలో అసమతుల్యతను స్పష్టం చేసిందన్నాడు ఆర్. అశ్విన్.
