Akunuri Murali : జనార్దన్ రెడ్డి శని పోయింది
నిప్పులు చెరిగిన ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్, మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీల వ్యవహారం, అంతులేని అవినీతి, అక్రమాలపై ఆయన బాహాటంగానే ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు.
Akunuri Murali Shocking Comments
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతికి అందలం ఎక్కించాడని దీంతో బాధ్యతల కలిగిన అధికారులు ఎవరూ ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు.
స్వచ్చంధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మారేంత వరకు ఆయన పదవిని అట్టి పెట్టుకుని ఉండడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆకునూరి మురళి(Akunuri Murali). ఇకనైనా కొత్త ప్రభుత్వం బాధ్యతతో కూడిన, నీతి నిజాయితీ, నిబద్దత కలిగిన వ్యక్తులను , మచ్చ లేని వారిని చైర్మన్ గా, సభ్యులుగా నియమించాలని కోరారు ఆకునూరి మురళి.
గతంలో టీఎస్ఎపీస్సీ చైర్మన్ గా పని చేసిన ఘంటా చక్రపాణి హయాంలో నియమించిన ఉద్యోగుల భర్తీ పై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎస్డీఎఫ్ కన్వీనర్.
Also Read : TSPSC Chairman : టీఎస్పీఎస్సీ చైర్మన్ రిజైన్