Bandi Sanjay : గులాబీ దొంగలపై కన్నేసి ఉంచండి
వాళ్ల పాస్ పోర్టులు సీజ్ చేయాలి
Bandi Sanjay : హైదరాబాద్ – బీజేపీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదని బీజేపీ పార్టీనేనని స్పష్టం చేశారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Bandi Sanjay Comments on BRS Party
గతంలో కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి రజాకర్లను మరిపించేలా చేశారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను , ప్రస్తుత ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వెంటనే గులాబీ దొంగలను ఇతర దేశాలకు వెళ్లకుండా పాస్ పోర్టులను నిలిపి వేయాలని రాష్ట్ర సర్కార్ ను కోరారు. లేకపోతే అరెస్ట్ కాకుండా తప్పించు కునేందుకు ప్లాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు బండి సంజయ్ కుమార్ పటేల్.
ఇదిలా ఉండగా బీజేపీ మాజీ చీఫ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గులాబీ గూండాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు.
Also Read : Harish Rao : అధ్యక్షా గొంతు నొక్కితే ఎలా