అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో గురువారం బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. బాధితులలో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారేనని సమాచారం. ఈ మేరకు అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒక లారీ ప్రైవేట్ ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు వేగంగా ఆ రెండు వాహనాలను చుట్టుముట్టాయి. 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ ,జగిత్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో, బాధితులు , వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతాల నుండే ప్రయాణిస్తున్నారు.
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకకుంది. నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి శర్మిల తెలిపిన వివరాల ప్రకారం, హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ఆ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుండి నెల్లూరు జిల్లాకు ప్రయాణిస్తోంది. అందులో 15 మంది మహిళలతో సహా మొత్తం 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఉదయం 8:40 గంటల సమయానికి, అధికారులు కాలిపోయిన బస్సు అవశేషాల నుండి 14 మృతదేహాలను వెలికి తీశారు. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం, ప్రయాణీకులందరూ ఆంధ్రప్రదేశ్కు చెందినవారేనని, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మేస్త్రీలుగా (తాపీ పనివారిగా) పని చేస్తున్నారని తేలింది. వీరిలో నలుగురు బుధవారం రాత్రి నిర్మల్ వద్ద బస్సు ఎక్కగా, మిగిలిన ప్రయాణీకులు జగిత్యాల జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
