Central Minister : హైదరాబాద్ ఆటో లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా

ఇదిలా ఉండగా... బీజేపీ చేస్తున్నది విజయ సంకల్ప యాత్ర కాదు విహార యాత్ర అని

Central Minister : హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి వచ్చారు. ఆయన ఆటోలో ఉప్పల్ జిల్లాలో ప్రయాణించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి అయి ఇతర ప్రయాణికుల్లాగే ఆటోలో ప్రయాణించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Central Minister Viral

ఇదిలా ఉండగా… బీజేపీ చేస్తున్నది విజయ సంకల్ప యాత్ర కాదు విహార యాత్ర అని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధు సూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పరంగా విజయం సాధించారన్నారు. రేవంత్‌ను ప్రజలంతా హర్సిస్తే బీజేపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Also Read : Begger Died: యాచకుడ్ని కాలితో తన్నిన అధికారి ! టిప్పర్ క్రింద పడి మ‌ృతి !

Leave A Reply

Your Email Id will not be published!