Chandra Babu Naidu : తుఫాను బాధితుల‌ను ఆదుకోవాలి

టీడీపీ చీప్ నారా చంద్ర‌బాబు నాయుడు

Chandra Babu Naidu : అమ‌రావ‌తి – రాష్ట్రంలో తాజాగా కురిసిన వ‌ర్షాల దెబ్బ‌కు భారీ ఎత్తున పంట‌లు దెబ్బతిన్నాయి. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. బాధితుల‌ను ఆదుకోవ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెందింద‌ని మండిప‌డ్డారు. వ‌ర్షాల ప్ర‌భావంతో చోటు చేసుకున్న ప‌రిస్థితులు తీవ్ర ఆవేద‌న‌న క‌లిగించాయ‌ని అన్నారు.

Chandra Babu Naidu Comment

ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌లు క‌ళ్ల ముందే రాలి పోవ‌డం త‌న‌ను ఎంతో బాధ‌కు గురి చేసింద‌ని అన్నారు చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). రైతుల క‌ష్టం చూస్తే త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు. రైతుల‌తో పాటు కౌలు రైతులు కూడా తీవ్రంగా న‌ష్ట పోయార‌ని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర స‌ర్కార్ పై ఉంద‌న్నారు.

ఏరియ‌ల్ స‌ర్వే చేసినంత మాత్రాన బాధితుల ఇబ్బందులు తొలుగుతాయా అని ప్ర‌శ్నించారు నారా చంద్ర‌బాబు నాయుడు. కౌలు రైతులు కుదేల‌య్యార‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే న‌ష్ట పోయిన రైతుల‌ను, బాధితుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

అన్న‌దాల‌కు ప‌రిహారం పంపిణీ చేయ‌డంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.

Also Read : CM Revanth Reddy : ఉద్య‌మ‌కారుల‌పై కేసుల ఎత్తివేత

Leave A Reply

Your Email Id will not be published!