Chandra Babu Naidu : ఐటీ రంగంలో తెలుగోళ్లు టాప్

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

Chandra Babu Naidu : బెంగ‌ళూరు – ఏ దేశానికి వెళ్లినా తెలుగు వారు ఉంటార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం బెంగ‌ళూరులో టీడీపీ ఐటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఐటీ రంగంలో తెలుగు వారు పోటీ ప‌డుతున్నార‌ని తెలిపారు.

Chandra Babu Naidu Comment

ప్ర‌పంచంలో న‌లుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒక‌రు తెలుగు వారు ఉంటార‌ని ఈ క్రెడిట్ అంతా తాను చేసిన కృషి వ‌ల్ల‌నే చోటు చేసుకుంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ దేశంలో ఐటీ శ‌ర వేగంగా విస్త‌రించింద‌ని దీనిని మ‌రింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఐటీ రంగ నిపుణులు గుర్తించి , మ‌రింత మెరుగైన నైపుణ్యాలు పొందేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఇవాళ వ‌ర‌ల్డ్ ను ఐటీ రంగం శాసిస్తోంద‌ని అన్నారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేని ప‌రిస్థితికి వ‌చ్చార‌ని పేర్కొన్నారు.

Also Read : TTD Chairman Bhumana : ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!