Chandra Babu Naidu : రైతుల‌ను ఆదుకోవ‌డంలో విఫ‌లం

ఏపీ సీఎం జ‌గ‌న్ పై చంద్ర‌బాబు ఫైర్

Chandra Babu Naidu : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా పంట‌లు కోల్పోయిన బాధిత రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. త‌మ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు న‌ష్ట ప‌రిహారం రాలేద‌ని వాపోయారు. వారి గోడు విన్న చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Chandra Babu Naidu Slams Jagan Govt

రైతుల‌ను ఆదుకోవ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. వెంట‌నే పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌కు ఒక ఎక‌రానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

తాను సీఎంగా ఉన్న స‌మ‌యంలో చోటు చేసుకున్న తుఫాన్ల‌ను ధాటిగా త‌ట్టుకున్న‌ట్లు చెప్పారు. వెంట‌నే బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, సాయం చేసిన‌ట్లు చెప్పారు. పాల‌నా ప‌రంగా ఏపీ సీర్కార్ వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి కేవ‌లం ఏరియ‌ల్ స‌ర్వే చేస్తే స‌రి పోతుందా అని నిల‌దీశారు మాజీ సీఎం. న‌ష్ట పోయిన ప్ర‌తి ఒక్క‌రిని ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. మొత్తంగా మానవ‌తా దృక్ఫ‌థంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచించాల‌ని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Also Read : Komatireddy Venkat Reddy : కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా

Leave A Reply

Your Email Id will not be published!