CM Revanth Reddy : సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి
వేద పండితుల ఆశీర్వచనం
CM Revanth Reddy : హైదరాబాద్ – పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy for Telangana
తాము పాలకులం కామని ప్రజా సేవకులమని ప్రకటించారు. గడీల పాలన పోయిందని, ప్రజా తెలంగాణ వచ్చిందన్నారు. ఇక తెలంగాణకు సంబంధించి నాలుగున్నర కోట్ల మంది తమ కుటుంబమని చెప్పారు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చని అన్నారు.
సీఎంగా కొలువు తీరిన వెంటనే దూకుడు పెంచారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారారు. వచ్చీ రావడంతోనే నూతన సెక్రటేరియట్ కు వెళ్లారు. ఆయనకు సీఎస్ తో పాటు ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా 6వ ఫ్లోర్ లోకి వెళ్లారు. రేవంత్ రెడ్డికి(Revanth Reddy) వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
అనంతరం సీఎం కుర్చీపై ఆశీసునలయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని వినతులు ఇవ్వాలని అనుకుంటే రావచ్చని స్పష్టం చేశారు.
Also Read : Shiva Dhar Reddy : ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి