Eatala Rajender : నా ల‌క్ష్యం కేసీఆర్ ప‌త‌నం

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

Eatala Rajender : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. త‌న యుద్దం చిల్ల‌ర గాళ్ల‌తో కాద‌న్నారు. త‌న పోరాటం పూర్తిగా కేసీఆర్ పైనేన‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన స‌భ‌లో ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender) ప్ర‌సంగించారు.

Eatala Rajender Slams CM KCR

రాష్ట్రంలో కొంద‌రు నేత‌లు చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డింద‌ని అనుకుంటోంద‌న్నారు. కానీ కాంగ్రెస్ లో ఎవ‌రు గెలిచినా వాళ్లు చివ‌ర‌కు వెళ్లేది బీఆర్ఎస్ గూటికేన‌ని, ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు.

ఆనాడు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో అత్య‌ధిక శాతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని, ఈ విష‌యం జ‌నాలంద‌రికీ తెలియ‌ద‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని ఎద్దేవా చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

ఎవ‌రు గెలిచినా చివ‌ర‌కు ప‌వ‌ర్ లోకి వ‌చ్చేది కేసీఆర్ అని , ఈ విష‌యం గుర్తు పెట్టుకుని త‌మ విలువైన ఓటును అభివృద్దిని నిరంత‌రం కాక్షించే బీజేపీకి వేయాల‌ని కోరారు. త‌ల రాత‌ను మార్చే గొప్ప ఆయుధం ఓటు అని దానిని జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించు కోవాల‌ని సూచించారు . చంద్రబాబు ఎంత స‌పోర్ట్ చేసినా కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు.

Also Read : ED Attaches : జెట్ ఎయిర్ వేస్ ఆస్తులు జ‌ప్తు

Leave A Reply

Your Email Id will not be published!