Harish Rao : చిదంబ‌రం క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

నిప్పులు చెరిగిన త‌న్నీరు హ‌రీశ్ రావు

Harish Rao : హైద‌రాబాద్ – మాట మార్చ‌డం , అబ‌ద్దాలు చెప్ప‌డం కాంగ్రెస్ పార్టీకి అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అంత‌కు ముందు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కురాలు , యాంక‌ర్ క‌త్తి కార్తీక గౌడ్ హ‌రీశ్ రావు(Harish Rao) స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంత‌రం ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిదంబ‌రం బాధ్య‌తా రాహిత్యంగా మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు.

Harish Rao Comments on Chidambaram

కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల‌నే యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డింద‌ని, దీనికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణ‌మ‌ని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నిస్సిగ్గుగా ఇక్క‌డికి వ‌చ్చి సానుభూతి ప‌లికినంత మాత్రాన తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని స్ప‌ష్టం చేశారు హ‌రీశ్ రావు.

రాష్ట్రంలో మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. కాంగ్రెస్ బ‌లుపు చూసి వాపు అనుకుంటోంద‌ని ఎద్దేవా చేశారు. నిరాధార‌మైన కామెంట్స్ తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను త‌క్కువ చేసి మాట్లాడిన చిదంబ‌రం వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు.

Also Read : Eatala Rajender : కేసీఆర్ ఖేల్ ఖ‌తం – రాజేంద‌ర్

Leave A Reply

Your Email Id will not be published!