India Tribute : మ‌ణిపూర్ మృతుల‌కు ఎంపీల నివాళి

ఢిల్లీలోని గాంధీ విగ్ర‌హం ముందు కొవ్వుత్తులు

India Tribute : ప్ర‌తిప‌క్షాల కూట‌మి ఇండియా ఆధ్వ‌ర్యంలో ఎంపీలు ఢిల్లీ వేదిక‌గా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్ల‌మెంట్ సాక్షిగా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. మ‌ణిపూర్ లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయంటూ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన మంత్రి పార్ల‌మెంట్ సాక్షిగా స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పంద‌న లేక పోవ‌డంతో ఎంపీలు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

India Tribute To

26 పార్టీల‌కు చెందిన ఎంపీలు ఇటీవ‌లే ఇండియా(INDIA) పేరుతో విప‌క్షాల కూట‌మిగా ఏర్పడ్డారు. వీరంతా ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిర్ల‌క్ష్య‌మే కొంప ముంచిందంటూ ఆరోపించారు. మోదీ బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ పార్ల‌మెంట్ హౌస్ లోని మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ముందు భార‌త పార్ల‌మెంటేరియ‌న్లు త‌మ నిర‌స‌న కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.

మ‌ణిపూర్ బాధ‌ల‌ను స‌భ‌లో లేవ‌నెత్తాల‌ని విప‌క్షాల కూట‌మి కోరుతోంది. మ‌ణిపూర్ బాధితుల త‌ర‌పున స‌భ‌లో గ‌ళం వినిపిస్తూ వ‌స్తున్నారు. అక్క‌డ ఏం జ‌రుగుతుందో దేశ ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీలు. కొవ్వుత్తుల‌తో గాంధీ విగ్ర‌హం ముందు మ‌ణిపూర్ హింస‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.

Also Read : Twitter Logo Comment : అయ్యో పిట్ట‌కూత‌కు ఎంత క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!