Kothakota Srinivas Reddy : ధ‌ర్నా చౌక్ కు గ్రీన్ సిగ్న‌ల్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీపీ

Kothakota Srinivas Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆ మేర‌కు ప‌వ‌ర్ లోకి రావ‌డంతో వ‌చ్చిన వెంట‌నే ధ‌ర్నా చౌక్ ను పున‌రుద్ద‌రిస్తామ‌ని వెల్ల‌డించారు.

Kothakota Srinivas Reddy Comment

ఇందులో భాగంగా శుక్ర‌వారం ధ‌ర్నా చౌక్ ప్రాంతాన్ని ప‌రిశీలించారు నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి.

ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ధ‌ర్నా చౌక్ ను య‌ధావిధిగా కొన‌సాగించేందుకు సానుకూల‌త వ్య‌క్తం చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా తాను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌న్నారు శ్రీ‌నివాస్ రెడ్డి.

ధ‌ర్నా చౌక్ లో సౌక‌ర్యాలు మెరుగు ప‌ర్చేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. ధ‌ర్నా చౌక్ లో ఎవ‌రైనా ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. ధ‌ర్నాలు న‌డుస్తున్న స‌మ‌యంలో ట్రాఫిక్ ను మూసి వేసే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి.

ట్రాఫిక్ కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు సీపీ.

Also Read : IAS Transfers : తెలంగాణ‌లో ఐఏఎస్ ల బ‌దిలీ

Leave A Reply

Your Email Id will not be published!